Thursday, April 25, 2024

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. పరిస్థితి విషమం

కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా పాజిటివ్‌ బారిన పడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్వయంగా డాక్టర్ అయిన ఎమ్మెల్యే శ్రీదేవి తనకు వైరస్‌ సోకినా అశ్రద్ధ చేయడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రమైందని వైద్యులు తెలిపారు. కాగా ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంవో కార్యాలయం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement