Thursday, May 2, 2024

టీడీపీకి ఓటు వేసాడని ఇంటి ముందు గోడ కట్టేసిన వైసీపీ నేతలు

వైసీపీ నేతల రౌడీయిజం రోజురోజుకి పెరిగిపోతుంది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో వైసీపీ నేతలు పంచాయతి ఎన్నికలలో వైసీపీకి ఓటు వేయలేదని టీడీపీ కార్యకర్త కాలేశ్వరవు ఇంటికి అడ్డుగా గోడ కట్టారు. గోడను కూల్చి వెయ్యాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పంచాయతీ, రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోలేదు.

దీనితో ఉన్నత అధికారుల దృష్టికి ఈ విషయం వెళ్లడంతో గోడను కూల్చడానికి వచ్చిన అధికారులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.కోర్టులో ఆర్డర్ తీసుకొస్తామని అప్పటివరకు నిర్మించిన గోడను కుల్చవద్దని పంచాయతీ సెక్రెటరీ ని వైసీపీ నేతలు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement