Tuesday, April 30, 2024

Vishakha Test Match – యశస్వీ సూపర్ శతకం… భారీ స్కోర్ దిశగా భారత్

విశాఖ‌ప‌ట్ట‌ణం లో ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ చేశాడు.. టీ విరామ స‌మ‌యానికి 125 పరుగుల‌తో నాటౌట్ గా క్రీజులో పాతుకు పోయాడు. భార‌త్ ప్ర‌స్తుతం నాలుగు వికెట్ల న‌ష్టానికి 249 ప‌రుగులు చేసింది.. సెంచ‌రీతో మెరిసిన య‌శ‌స్వీ, అరంగేట్రం బ్యాట‌ర్ ర‌జ‌త్ పాటిదార్ తో కలసి నాలుగో వికెట్‌కు 70 ర‌న్స్ జోడించారు. పాటిదార్ తొలి మ్యాచ్‌లోనే 32 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు అండ‌గా నిలిచాడు. భార‌త్ 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది… ..అంతకు ముందు .రోహిత్‌ (14), గిల్‌ (34), శ్రేయస్‌ (27) నిరాశపరిచారు. బషీర్‌, జేమ్స్‌ అండర్సన్‌, హార్ట్‌లీ, రెహ‌నా అహ్మద్ తలో వికెట్‌ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement