Tuesday, May 14, 2024

అమ్మ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్..సోనియా గాంధీ థ్యాక్స్ చెప్పారు. అమ్మ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఆమెకు థాంక్స్‌ చెప్పాలి’’ అన్నారు రాములునాయక్‌. మంగళవారం ఖమ్మం జిల్లాలోని బొక్కలతండాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇక సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన ఎమ్మెల్యే రాములు నాయక్..పార్టీలకతీతంగా ఈ రోజు సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి (రూ.1,16,000) చెక్కులు పంపారని వ్యాఖ్యనించారు.

కేసీఆర్‌ తన, మన తేడా లేకుండా అందరి గురించి ఆలోచన చేసే సందర్భంగా అన్ని పార్టీలు కూడా ఆయన్ను ఆశీర్వదిస్తున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిని చేశాయి. మూడోసారి కూడా ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతారనడంలో అతిశయోక్తిలేదు. ఇంత ఆలోచన చేశాక.. కేసీఆర్‌ గురించి మీరు కూడా ఆలోచించాలిగా.. ఎవరైనా, ఏ భావజాలంవారైన కావచ్చు’’ అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ వ్యాఖ్యనించారు. ‘‘నక్సల్స్‌ అయినా కావచ్చు.. ఎన్టీ రామారావు ఏమన్నారు.. నక్సల్స్‌ కూడా దేశభక్తులే అన్నారు.. ఆయనకు నమస్కారం చేయాలి. ఎస్‌.. అది కరెక్ట్‌ భావజాలం. ఎక్కడైనా అభివృద్ధికి సపోర్ట్‌ చేయాల్సిందేనన్నారు.  

ఇది కూడా చదవండి: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement