Monday, May 6, 2024

తొలిసారి భారత్​ రానున్న WWE సూపర్‌స్టార్.. హైద‌రాబాద్ లో జరిగే పోటీల్లో జాన్ సెనా!

వ‌రల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్టైన్మెంట్ (WWE) లెజెండ్, మల్టీ టైమ్ ఛాంపియన్ జాన్ సెనా మొద‌టిసారిగా భారత్​ రాబొతున్నారు. వ‌చ్చే నెల (సెప్టెంబర్) 8న హైదరాబాద్‌లో జరగనున్న సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌లో భారతదేశంలో మొదటిసారిగా రెజ్లింగ్​ పోటీల్లో పాల్గొన‌నున్నారు. జాన్ సెనా భారత్​కు రావ‌డం ఇది రెండవసారి.. అయితే అతను ఇన్-రింగ్ యాక్షన్ ఈవెంట్‌లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.

2006లో తన భార‌త‌దేశ పర్యటనలో, బ్రాడ్‌కాస్టర్ ప్లాన్‌లో భాగంగా ముంబైలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ల కోసం సెనా భారతదేశంలో ఉన్నారు. త‌ను భార‌తదేశానికి రానున్న‌ట్టు ఇప్పుడు సెనా స్వయంగా ట్విట్ట‌ర్ X లో ధ్రువీకరించారు. 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అతను భారతదేశంలో మొదటిసారిగా రెజ్లింగ్ చేస్తానని, దేశంలోని WWE అభిమానులను కలవడానికి ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement