Friday, May 3, 2024

ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొదటి పురుషుడు మృతి

లండన్: ప్రపంచంలోనే తొలిసారిగా కోవిడ్‌–19 టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన విలియం షేక్‌స్పియర్‌ (81) సోమవారం కన్నుమూశారు. యూనివర్సిటీ హాస్పిటల్‌ కోవెంట్రీ, వారివక్‌షైర్‌లో గత ఏడాది డిసెంబర్‌ 8న మొట్టమొదటి ఫైజర్‌ టీకా డోస్‌ తీసుకున్న పురుషుడిగా షేక్‌స్పియర్‌ రికార్డు నెలకొల్పారు. కరోనా యేతర సమస్యలతో ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్‌ ఈనెల 20న కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా విలియం షేక్‌స్పియర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

అంతకుముందు యూనివర్సిటీ హాస్పిటల్‌ కోవెంట్రీ, వారివక్‌షైర్‌ ఆస్పత్రిలోనే మార్గరెట్‌ కీనన్‌ (91) కూడా కోవిడ్‌ టీకా తీసుకుని తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement