Saturday, April 20, 2024

బీజేపీలో చేర‌ను: ఈట‌ల రాజేంద‌ర్

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. ఈటల రాజేందర్‌ను త‌మ పార్టీలో చేరాల‌ని బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో కేంద్ర స‌హాయ మంత్రి, బీజేపీ నేత‌ కిషన్‌రెడ్డితో పాటు కీల‌క నేత‌ గడ్డం వివేక్‌ ఈటలతో ర‌హ‌స్యంగా స‌మావేశం జ‌రిపి ఈ విష‌యంపై చ‌ర్చించిన‌ట్లు మీడియా దృష్టికి వ‌చ్చింది. దీనిపై ఈటల రాజేంద‌ర్ స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో ఆయ‌న ఈ రోజు మాట్లాడుతూ… తాను మద్దతు కోరేందుకే బీజేపీ నేతలను కలిశానని, అంతేగానీ, బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ హుజురాబాద్‌ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పారు.  దీనిపై త్వరలోనే అధికారికంగా తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement