Sunday, April 28, 2024

కరీంనగర్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు.. పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి గంగుల

ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే విధంగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తెలంగాణ చౌక్ లో ఒక కోటి 20 లక్షలతో ఆధునికరించిన అత్యాధునిక ఐలాండ్ ను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేబుల్ బ్రిడ్జి కరీంనగర్ కు తలమానికంగా మారిందన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ళలో అత్యాధునిక ఐలాండ్ లను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతం లో ఎవరు చేయని విధంగా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement