Sunday, April 28, 2024

అహ్మాదాబాద్ లో వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వేస్టేష‌న్-ఊహా చిత్రాన్ని విడుద‌ల చేసిన కేంద్ర మంత్రి

అహ్మాదాబాద్ లో అంత‌ర్జాతీయస్థాయి ప్ర‌మాణాల‌తో ఓ రైల్వేస్టేష‌న్ ని నిర్మించేందుకు నిర్ణ‌యించింది కేంద్ర ప్ర‌భుత్వం. వ‌ర‌ల్డ్ క్లాస్ వ‌స‌తుల‌తో అల‌రారుతున్న అంత‌ర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేష‌న్‌ను తీర్చిదిద్దనున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు అహ్మాదాబాద్‌లో నిర్మించ‌నున్న వ‌రల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్ ఊహా చిత్రాల‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే అహ్మ‌దాబాద్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్న ఈ రైల్వే స్టేష‌న్ వ‌స‌తుల విష‌యంలో ఏ ఒక్క అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి తీసిపోద‌ని గోయ‌ల్ పేర్కొన్నారు. అహ్మ‌దాబాద్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇస్తున్న మ‌రో బ‌హుమ‌తిగా ఈ రైల్వే స్టేష‌న్ నిల‌వ‌నుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement