తొలి రెండు మ్యాచుల్లో ఓటములను చవిచూసిన టీమిండియా మూడో టీ20 మాత్రం 7 వికెట్లతో ఘన విజయం సాధించి సిరీస్పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. మూడు రోజుల విరామం అనంతరం నాలుగో టి20కి సిద్ధమైంది. ప్రస్తుతం 1-2తో సిరీస్లో వెనుకబడిన భారత్ చివరి రెండు మ్యాచుల్లో గెలిచి ఈ సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇక, తప్పక గెలవాల్సిన చివరి టీ20 విజయం సాధించిన భారత్ నాలుగో టీ20లో ఆత్మవిశ్వసంతో మైదానంలో అడుగుపెడుతోంది.
కాగా, ఈ మ్యాచ్ కూడా భారత్ కు డూ ఆర్ డై లాంటిదే. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక, ఈ మ్యాచ్ కోసం వెస్టిండీస్ రెండు మార్పులు చేసింది. జేసన్ హోల్డర్, షై హోప్ తుది జట్టులోకి వచ్చారు. టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది.
తుది జట్లు..
వెస్టిండీస్
కైల్ మేయర్స్, షై హోప్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, రొవ్ మన్ పావెల్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, ఒబెద్ మెకాయ్
టీమిండియా
శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్ష్ దీప్ సింగ్, ముకేశ్ కుమార్