Sunday, April 28, 2024

Windies vs India – యశస్వి, రోహిత్ శతకాలు – భారీ స్కోరు దిశగా భారత్

డోమినికా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా పట్టుబిగిస్తోంది. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ (143 బ్యాటింగ్; 350 బంతుల్లో 14 ఫోర్లు), రోహిత్ శర్మ (103; 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.

రెండో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల 312 నష్టానికి పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 162 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. యశస్వి, విరాట్ కోహ్లీ (36) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement