Saturday, May 4, 2024

కరోనాతో భర్త మృతి…భయంతో భార్య ఆత్మహత్య

కరోనా మహమ్మారి వ్యాప్తి రోజుకురోజుకు అధికం అవుతుంది. సామాన్య ప్రజల పాలిట అయితే ఈ మహమ్మారి మృత్యువుగా మారుతుంది. తాజాగా హైదరాబాద్ వారాసిగూడ భూలక్ష్మమ్మ ఆలయం గల్లీలో లక్ష్మీనారాయణ (41), రూపాదేవి (37) దంపతులు నివాసం ఉంటున్నారు. కాగా లక్ష్మీనారాయణ కరోనాతో ఈ నెల
20న మృతి చెందాడు. అతని భార్య రూపాదేవి కూడా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ఒక వైపు భర్త మృతి చెందడంతోపాటు తనకు పాజిటివ్ వచ్చిందని భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement