Thursday, May 9, 2024

పీఆర్సీ ఊసేదీ ?

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనలు, నిధుల కేటాయింపులు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కనిపించలేదు. అసెంబ్లీ వేదికగా పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ బుధవారం
ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిట్మెంట్ను దాదాపు 30 శాతానికి పెంచితే రూ.9 వేల కోట్లు అదనంగా అవసరమవుతాయని ఆర్థికశాఖ లెక్కలేసింది. సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేయడంతో బడ్జెట్ లో వివరిస్తారని ఉద్యోగులు
భావించారు. కానీ ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావనే లేదు. పీఆర్సీకి సంబంధించిన ఏ అంశం బడ్జెట్ లో లేదు. దీంతో ఉద్యోగ వర్గాలు కొంత నిరుత్సాహానికి గురయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంపై కొన్ని నెలలుగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీనిపై బడ్జెట్ లో నిధులు ఉంటాయని ఉద్యోగులు అంచనా వేశారు. వేతనసవరణతో పాటుగా పదవీ విరమణ పెంపు కూడా బడ్జెట్ ప్రసంగంలో ఉంటుందనుకున్నారు. కానీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement