Tuesday, April 30, 2024

పీపీఈ కిట్ లేకుండా హాస్పిటల్లో తిరిగిన కేసీఆర్ పై ఎందుకు కేసు పెట్టలేదు…విజయశాంతి

సిద్దిపేట లో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు బీజేపీ మహిళా నేత విజయశాంతి. సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని మండిపడ్డారు.కోవిడ్ నిబంధనలకు లోబడి పీపీఈ కిట్స్ వేసుకుని హాస్పిటల్ లోకి వెళ్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు బనాయిస్తారా. రోజు లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తున్న వాళ్లపై ఎంత మంది పై కేసులు పెట్టు కోర్టు ముందు ప్రవేశ పెట్టారో చెప్పాలి అని డిమాండ్ చేశారు.

సిద్దిపేట అభివృద్ధి, హరీష్ రావు చెప్పుకుంటున్న అభివృద్ధి అంత డొల్ల అని తేలిపోయింది. సిద్దిపేట లో డమ్మీ అభివృద్హి బుడగ త్వరలో పగలడం ఖాయమని అన్నారు విజయశాంతి.సిద్దిపేట హాస్పిటల్లో కరోనా పేషేంట్లను పట్టించు కోవట్లేదని వాళ్ళ బంధువులు, టీఆరెస్ నేతలే వీడియో మెసేజ్ లు పెడుతున్నారు. సిద్దిపేట సర్కార్ దవాఖానకు పోతే చచ్చినట్లే అని పేషేంట్ల బంధువులు చెబుతుంటే అక్కడి చిన్న దొరకు, ఫామ్ హౌజ్ పెద్ద దొరకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు విజయశాంతి.

వాస్తవాలు చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లిన సిద్దిపేట జిల్లా బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు అరుణా రెడ్డి, ప్రధాన కార్య దర్శి పద్మ గౌడ్ పై కేసులు పెట్టిస్తారా?పీపీఈ కిట్స్ లేకుండా గాంధీ, ఎంజీఎం లో తిరిగిన సీఎం పై ఎం కేసు పెట్టాలన్నారు విజయశాంతి. ఆరోగ్య శ్రీ వెంటనే కరోనా చికిత్సను చేర్చి ఆరోగ్యశ్రీ పరిమితి ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలన్నారు విజయశాంతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement