Sunday, April 28, 2024

Breaking | డబుల్​ బెడ్రూం ఇల్లు కోసం ధర్నా చేస్తుంటే.. బస్సు వచ్చి గుద్దేసింది!

ఉమ్మడి మెదక్​ బ్యూరో, (ప్రభ న్యూస్​): డబుల్ బెడ్రూం ఇల్లు కోసం ధర్నా చేస్తున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం జరిగింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని బాధితుడు ఆందోళనకు దిగాడు. దీంతో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాడు. అప్పుడే అటుగా వస్తున్న బస్సు అతడిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement