Wednesday, May 1, 2024

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం ఎప్పుడు.. మోడీకి ట్విట్టర్‌లో కవిత ప్రశ్నలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గడిచిన ఎనిమిదేళ్ల పరిపాలనలో బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాని నరేంద్ర మోడీకి ఎనిమిది ప్రశ్నలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంధించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ట్వీట్‌ చేశారు. మహిళా శక్తికి సమాన ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించడంతో పాటు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మన దేశ జీడీపీ ఓ పక్క పడిపోతున్నా, జీడీపీ, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అమాంతంగా మాత్రం పెరుగుతున్నాయన్నారు. విచిత్రంగా అవి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఎదుకు లేవని, అమితంగా పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడన్నారు. తెలంగాణకు రావాల్సిన రూ.7వేల కోట్ల పెండింగ్‌ నిధులను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందన్నారు.

ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది మొహంగై ముక్త్‌ భారత్‌ అని ప్రకటించుకున్న మీరు అసలు అలాంటి అచ్చే దిన్‌ ఎప్పుడు తెస్తారని నిలదీశారు. విఫలమైన లా అండ్‌ ఆర్డర్‌, విఫలమైన వ్యవస్థలు.. దేశ ప్రజలకు కృత్రిమ ప్రచారాలు లేని నిజమైన అమృత్‌ కాల్‌ ఎప్పుడు వస్తుందన్నారు. రైతులు దేశానికి గుండె చప్పుడు, కానీ ఈ రోజు తెలంగాణలోని వరి, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపును కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం, న్యూ ఇండియా వాస్తవికత ఏంటంటే.. ఇక్కడ కోట్లాది మంది భారతీయులు తమకు కనీస ఆదాయం అందించే ఉపాధిని పొందడంలో కష్ట పడుతున్నారన్నారు. చిరవగా పీఎం కేర్స్‌ దేశ ప్రజలకు నిధుల గురించిన నిజమైన సమాచారం ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా అని కవిత మోడీని ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement