Sunday, May 5, 2024

ఐదేళ్లలో సగం తగ్గిన మమతా బెనర్జీ ఆస్తులు

పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ తన ఆస్తులను ప్రకటించారు. ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రకటించిన ఆస్తుల విలువతో పోలిస్తే ఇప్పుడు దీదీ ఆస్తుల విలువ దాదాపు సగానికి తగ్గింది. 2016లో ఆమె భవానీపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన సమయంలో తన ఆస్తుల విలువ రూ. 30,45,013గా ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. తాజా ఎన్నికలకు సంబంధించి మమతా బెనర్జీ డిక్లరేషన్ ఇస్తూ.. తన ఆస్తుల విలువ రూ. 16,72,352 అని పేర్కొన్నారు.

ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మమతా భూనియా, సుకుమార్ డే తదితరులు తమ సంపద 37 శాతం వరకూ తగ్గిందని తెలిపారు. ఇదే సమయంలో సీపీఎంకు చెందిన పన్సుకురా పుర్బా అభ్యర్థి షేక్ ఇబ్రహీమ్ మాత్రం 2016తో పోలిస్తే ఆస్తుల విలువను ఏకంగా 2,141 శాతం పెంచుకోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement