Sunday, May 5, 2024

పెళ్లి నుంచి వ‌స్తుండ‌గా… దుండ‌గుల చేతిలో..

ప్ర‌భ‌న్యూస్: బీహార్ రాష్ట్రం చ‌ప్రా జిల్లా జాఫ‌ర్‌పూర్‌లో గోల్డ్ వ్యాపారి అరుణ్ షా, స్నేహితుడు ఆశిష్ శ్రీ‌వాత్స‌వ‌ను వెంట బెట్టుకుని బైక్ పై ఓ పెళ్లికి వెళ్లాడు. పెళ్లి విందు అనంత‌రం తిరిగొస్తుండ‌గా దారి మ‌ధ్య‌లో దుండ‌గులు అడ్డుకున్నారు. అరుణ్ షాను చుట్టుముట్టి క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచేశారు. ఈ క్ర‌మంలో అరుణ్ షా స్నేహితుడు అక్క‌డి నుంచి త‌ప్పించుకుని పారిపోయాడు. వెంట‌నే పోలీసుల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు విష‌యం తెలియ‌జేశాడు.

పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చేస‌రికి దుండ‌గులు పారిపోయారు. మృత‌దేహం, అక్క‌డి కొద్ది రూంలో బైక్‌, హెల్మెట్ ఉండ‌టాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మృతుడు అరుణ్ షా స్నేహితుడు ఆశిష్ శ్రీ‌వాత్స‌వ‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో నెల‌కొన్న విభేదాల వ‌ల్లే హ‌త్య జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబ స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement