Tuesday, May 21, 2024

సంక్షేమ పథకాలే టీఆర్ఎస్‌ను గెలిపిస్తున్నాయి.. టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను గెలిపిస్తున్నాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఆయన, మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు, బీజేపీ ఓటమిపై మాట్లాడారు. ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులను, రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్)ను రంగంలోకి దించిందని అన్నారు.

ఎన్నికల ప్రచారం నుంచి మొదలుపెట్టి అన్నిచోట్లా అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, చివరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సైతం కొనేందుకు ప్రయత్నించి దొరికిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఆ పార్టీ అక్రమ పద్ధతుల్లో దాడులకు తెగబడుతోందని విమర్శించారు. ఇలాంటి చర్యలను ప్రజలు సమర్థించరని, మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పే ఆ పార్టీకి చెంపపెట్టు అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement