Wednesday, May 1, 2024

National : పెళ్లి ఊరేగింపు కారు.. ట్రాక్టర్‌ ఢీ.. ఏడుగురు మృతి…

బీహార్‌లో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఖ‌గారియా జిల్లాలో కారు…ట్రాక్ట‌ర్ ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు చిన్నారులతో స‌హా ఏడుగురు మృతి చెందారు.

పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిన ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. NH-31లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రిలో చేర్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లి ఊరేగింపు చౌతం బ్లాక్ నుండి తిరిగి వస్తోంది. ఈ మొత్తం ఘటన పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారత్న పెట్రోల్ పంప్ సమీపంలో నమోదవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement