Monday, May 6, 2024

ఆయూష్‌ యూజీ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌..

వరంగల్‌, ప్రభన్యూస్ : ఆయూష్‌ మాప్‌ ఆప్‌ విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ జారీచేసిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఆయూష్‌ యూజీ కన్వీనర్‌ కోటా సీట్లకు మాప్‌ ఆప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. విశ్వవిద్యాలయం పరిధిలోనె హోమియోపతి (బిహెచ్‌ఎంఎస్‌), ఆయురేద (బిఏఎంఎస్‌) నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ), యునాని(బీయూఎంఎస్‌) డిగ్రీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భ ర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధులు ఈనెల 19న సాయంత్రం 6 గంటల నుంచి 20వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

ఇప్పటికే అఖిల భారత కోటాలో ఆయూష్‌ కోర్సుల్లో చేరిన కాళోజీ, ఎన్టీఆర్‌ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులల్లో సీటు పొందిన అభ్యర్దులతో పాటు గత విడతలో సీటు పొంది చేరని అభ్యర్దులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులు. మరింత సమాచారం కోరకు విశవిద్యాలయం వెబ్‌సైట్‌ డబ్ల్యడబ్ల్యుడబ్ల్యు.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవీ.ఇన్‌లో చూడవచ్చని యూనెవర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement