Sunday, May 5, 2024

చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మ‌హానేత కేసీఆర్ – మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

భూదాన్ పొచంప‌ల్లి – చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నేతన్న ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరమగ్గల చప్పుడే కాదు నేతన్నల గుండె చప్పుడు బాగా తెలుసు అన్నారు.జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లి లో జరుగుతున్న వారోత్సవాలలో సహచర రాష్ట్ర ఐటి మరియు పురపాలక,చేనేత జౌళి శాఖామంత్రి కలువకుంట్ల తారకరామారావు తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. భోనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ ఉత్సవాలలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,రవీంద్ర నాయక్,చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నేతన్నల గుండె చప్పుడు తెలిసి నందునే ఉద్యమ కాలంలోనే ఉద్యమ నాయకుడిగా నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు భూదాన్ పోచంపల్లి,సిరిసిల్లలో పర్యటించి చేనేత కార్మికులను ఆదుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఆదరణ,గుర్తింపు లేక పోవడంతో ఆత్మాభిమానంతో అప్పులు చెయ్యలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కలత చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ నాయకుడిగా జోలె పట్టుకుని వసూలు చేసిన మొత్తలతో చేనేత కార్మికులకు అండగా నిలిచిన సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకే అధికారంలోకి వచ్చిందే తడవుగా సమస్యను సత్వరమే అర్థం చేసుకోగలిగిన కలువకుంట్ల తారకరామారావు ను చేనేత జౌళిశాఖ మంత్రిగా నియమించారన్నారు.మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎటు చూసినా కనిపించేది చేనేత కార్మికులే అయినందున ఈనాడు చేనేతలు ఇంతటి పురోగతి సాదించారన్నారు.నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆయన మద్దతుతో కేంద్రంలో కొలువుదీరిన ఎన్ డి ఏ,ఆ తరువాత అధికారంలోకి వచ్చిన యూపీఏ -1,2ప్రభుత్వాలు చేనేత కార్మికులను వారి ఆత్మాభిమానాలను గుర్తించ లేక పోయారని ఆయన దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement