Friday, May 10, 2024

అధైర్య‌ప‌డొద్దు అండ‌గా ఉంటాం : మంత్రి పువ్వాడ‌

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో గాయపడి ఖమ్మం సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ నవీన్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ఆసుపత్రిలో పరామర్శించారు. ఏమి అధైర్య పడొద్దు అని, వారి కుటుంబానికి ధైర్యం కల్పించారు. పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు ప్రభుత్వం తరపునే ఉచితంగా అందిస్తామని, దైర్యం కోల్పోవొద్దు అని దైర్యం చెప్పారు. ఎలాంటి వైద్య సేవలైన తక్షణమే అందించాలని, పూర్తిగా కోలుకునేవరకు మెరుగైన చికిత్సలను అందించాలని వైద్యులను మంత్రి పువ్వాడ అదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement