Thursday, May 2, 2024

ADB: నియోజకవర్గాన్ని పదింతల అభివృద్ధి చేస్తాం.. రోడ్ షోలో కేటీఆర్

చెన్నూర్, (ప్రభ న్యూస్) : మరో రెండు రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ను భారీ మెజారిటీతో గెలిపించండి.. ప్రస్తుత అభివృద్ధికన్నా మరో పదింతలు రెట్టింపు అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోందని వారి మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తొలగించి, మరింత అభివృద్ధి చేసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 24గంటల కరెంటు అందుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి ప్రస్తుత సుమన్ చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ఓటువేయాలని కోరారు. సభకు హాజరైన ప్రజలు సైతం కేటీఆర్ తో గులాబి కండువాలు తిప్పడం ఆకర్షణీయంగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement