Thursday, April 25, 2024

మునుగోడు ఎన్నికపై 20న నిర్ణయం ప్రకటిస్తాం.. చాడ వెంకట్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికపై ఈనెల 19, 20న తమ పార్టీ నిర్ణయం ప్రకటిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈనెల 19, 20 తేదీల్లో సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందన్నారు. మునుగోడులో తాము ఐదు సార్లు గెలిచామన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కేంద్రం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ఇవ్వడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement