Friday, April 26, 2024

Warangal : ఫేక్ స్వామీజీ గుట్టు రట్టు.. చితకబాదిన మహిళలు..

తొర్రూరు టౌన్, (ప్రభ న్యూస్) : డివిజన్ కేంద్రంలో రెక్కీ నిర్వహించి నకిలీ స్వామీజీని మహిళలు పట్టుకొని చితకబాది పోలీస్ స్టేషన్ కు తరలించిన సంఘటన శనివారం బస్టాండ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధిత మహిళ తరఫున నకిలీ స్వామిని పట్టుకున్న మహిళ‌లు మాట్లాడుతూ.. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను లోబరుచుకొని నగ్న వీడియోలు, ఫోటోలు తీసి వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ తన ఆరోగ్య పరిస్థితి బాగోలేక స్వామీజీని ఆశ్రయించడంతో ఇదే అదునుగా భావించిన స్వామీజీ మహిళను తాయత్తులతో కట్టి లోబరుచుకొని డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో నకిలీ స్వామీజీ గురించి బాధిత మహిళ హైదరాబాద్ లోని మహిళా సంఘాలను ఆశ్రయించినదని తెలిపారు. గత రెండు నెలలుగా లోబ‌ర్చుకొని ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని బెదిరిస్తూ డబ్బులు వసూల్ చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేయడంతో డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో స్వామీజీని మహిళా సంఘాలు చితకబాదారు. అనంత‌రం స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో నకిలీ స్వామీజీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement