Saturday, May 4, 2024

War Begins – గాజాలో మ‌ళ్లీ న‌రమేథం… విరుచుకుప‌డ్డ ఇజ్రాయెల్.. 178 మంది బ‌లి

వారం రోజుల విరమణకు తెర పడటంతో గాజా స్ట్రిప్​ మళ్లీ కాల్పులతో దద్దరిల్లుతోంది. విరామం అనంతరం ఇజ్రాయెల్​ రెట్టించిన తీవ్రతతో మళ్లీ దాడులకు దిగింది. గాజాలోని ఇళ్లు, భవనాలపై క్షిపణులు, రాకెట్లు, బాంబులతో విరుచుపడిందిదీంతో ఖాన్​ యూనిస్​లో ఒక భారీ భవన సముదాయం నెలమట్టమైనట్లు తెలుస్తోంది. హమాద్​లో కూడా ఒక అపార్ట్​మెంట్​పై క్షిపణుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత జరిగిన దాడుల్లో గాజాలో కనీసం 178 మంది మరణించినట్లు హమాస్​ తాజాగా ప్రకటించింది

‘యుద్ధ లక్ష్యాల సాధనకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. బందీలందరినీ విడిపించుకోవడం, హమాస్​ను నిర్మూలించడం, గాజా మరెప్పుడూ ఇజ్రాయెలీలకు ముపపుగా మారకుండా కట్టుదిట్టటమైన చర్యలు తీసుకునే దాకా సైనిక చర్య కొనసాగుతోంది’ అంటూ ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది.

మహిళా బందీలందరినీ వదిలేస్తామన్న ఒప్పంద వాగ్దానాన్ని హమాస్​ ఉల్లంఘించడం వల్లే దాడులను తిరిగి మొదలు పెట్టాల్సి వచ్చిందని నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయెలే రక్త దాహంతో తమ ప్రాతిపాదనలన్నింటినీ బుట్టదాఖలు చేసి దాడులకు దిగిందని హమాస్​ రోపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement