Monday, April 29, 2024

వైజాగ్ లో వాల్తేరు వీర‌య్య ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక మార్చ‌డంపై నో కామెంట్ అన్న చిరంజీవి

నేడు వాల్తేరు వీర‌య్య చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విశాఖ ఏయు ఇంజ‌నీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జ‌ర‌న‌గ‌నుంది. కాగా ఈ వేడుక‌ని ముందుగా ఆర్కే బీచ్ రోడ్ లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్డుకు సందర్శకులు భారీగా వస్తారని, ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు తెలిపారు. దీంతో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఎయిర్‌పోర్టుకి బయల్దేరారు మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ నుంచి విశాఖకి వెళ్లనున్నారు. సాయంత్రం వైజాగ్‌లో వాల్తేరు వీరయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి హాజరుకానున్నారు. వాళ్ల వీలును బట్టి పర్మిషన్‌ ఇస్తారని.. ఈ సందర్భంగా జగన్‌ సర్కార్‌పై చిరంజీవి కామెంట్స్‌ చేశారు. వేదిక మార్చడంపై మాత్రం చిరంజీవి… నో కామెంట్‌ అంటూ వెళ్లి పోయారు.ఇక నటుడు రవితేజ కూడా ఈ వేడుకకి హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement