Saturday, May 18, 2024

జైలుకి వెళ్ళేందుకు సిద్ధం..విశాఖని వీడబోం..పవన్ కళ్యాణ్

జైలుకి అయిన వెళ్లడానికి సిద్ధమని..విశాఖపట్నంని వీడేదే లేదన్నారు జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఎన్నికేసులు పెట్టినా సరే విశాఖను వీడేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. విశాఖ పర్యటనకు వచ్చేలోపే గొడవజరిగితే తానెలా బాధ్యుడని జనసేనాని పవన్ కళ్యాణ్ పోలీసులను ప్రశ్నించారు. రుషికొండపై కబ్జాదారుల విధ్వంసాన్ని వెలికి తెస్తామన్న ‎ఉద్ధేశంతో డ్రోన్లకు అనుమతి ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. మేం విశాఖ రాకముందే గొడవ జరిగింది. మేం వచ్చి రెచ్చగొట్టడం వల్లే ఘటన జరిగినట్లుగా నోటీసులిచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం. నేర చరిత్ర గల నేతలు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చే వరకు మేం పోరాడతాం. ప్రశ్నించేతత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.కాగా పవన్ కల్యాణ్ ని చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున్న నోవాటెల్ హోటల్ కి తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement