Wednesday, May 1, 2024

ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన విశాల్ ‘మార్క్ ఆంటోనీ’.. స్ట్రీమింగ్ వివరాలివే

తమిళ హీరో విశాల్, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘మార్క్ ఆంటోనీ’. గ‌త నెల (సెప్టెంబర్) 15న రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే మంచి విజయం సాధించింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ సినిమా వచ్చిన ఈ మూవీ రూ.100కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి విశాల్ కెరీర్‌లో తొలి రూ.100కోట్ల మూవీగా నిలిచింది. కాగా, ఇప్పుడు మార్క్ ఆంటోనీ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది.

మార్క్ ఆంటోనీ డిజిట‌ల్ రైట్స్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకోగా.. అక్టోబర్ 13వ తేదీన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ఇవ్వాల అధికారికంగా ప్రకటించింది. తమిళం, తెలుగులో భాష‌ల్లో అక్టోబర్ 13 తేదీన మార్క్ ఆంటోనీ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement