Monday, April 29, 2024

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. రాను రాను రాజకీయాలు మురికికుంపలా తయారవుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడే రాజకీయ నేత ఒక్కరూ లేరంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గతంలో ఎమ్మెల్యే గెలిస్తే అభివృద్ధి జరిగేది అని.. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని సెటైర్లు వేస్తున్నారు. దీనికి ఉదాహరణగా తెలంగాణలోని హుజురాబాద్‌ను చూపిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ కోట్లు కుమ్మరిస్తోంది. ఇందుకోసం దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి రూ.లక్షలు లక్షలను పంచడానికి సిద్ధమైంది. దీంతో మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే బాగుండు అని కోరుకుంటున్నారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్

Advertisement

తాజా వార్తలు

Advertisement