Monday, April 29, 2024

వైరల్: 15 రోజుల ఆస్పత్రి బిల్లు రూ.22.90 లక్షలు

రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వార్త సారాంశం ఏంటంటే… హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఓ కరోనా రోగికి 15 రోజులకు రూ.22.90 లక్షలు బిల్లు వేశారు. దీంతో కార్పొరేట్ ఆస్పత్రులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ప్రాణాలు నిలుపుకోవడానికి ఆస్పత్రిలో చేరితే… రోగి ఆస్తినంతా కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఊడ్చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే సదరు వార్తలో ఎంత నిజముందో అపోలో ఆస్పత్రి యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement