Friday, April 26, 2024

దంగల్: క్వార్టర్ ఫైనల్‌కు వినేశ్ ఫొగాట్

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ దూసుకుపోతోంది. మహిళల 53 కేజీల విభాగం ప్రీక్వార్టర్స్‌లో స్వీడన్ రెజ్లర్ మ్యాట్‌సన్‌ సోఫియాను 7-1 తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచులో ఆది నుంచీ ఆధిపత్యం చలాయించింది. దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. తొలి పిరియడ్‌లో 2, 2, 1 స్కోరు సాధించిన ఆమె రెండో పిరియడ్‌లో 2 మాత్రమే సాధించింది. ప్రత్యర్థి 1 పాయింటు సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో ఫొగాట్ బెలారస్‌ రెజ్లర్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement