Sunday, May 5, 2024

మంత్రి కేటీఆర్ ను కలిసిన వికారాబాద్ జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే

వికారాబాద్ : అందరూ కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేయాలనీ ఐటి అండ్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీత మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పంచాయితీ చివరకు మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఈరోజు హైదరాబాద్ లోని వారి ఛాంబర్ లో మంత్రి కేటీఆర్ ను జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తదితరులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా.. సమన్వయంతో పనిచేయాలన్నారు. అధిష్ఠానం సూచనలను ఆచరిస్తూ… అందరం కలసికట్టుగా పని చేస్తామని నేత‌లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement