Friday, May 3, 2024

వైఎస్ఆర్ వర్థంతి సభలో ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

విశాఖ జీవీఎంసీలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ వర్థంతి సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్లకు కర్తవ్య బోధన చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేయాలని.. ఇకపై అభివృద్ఘిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పదవుల విషయంలో అందరికీ అవకాశం కల్పిస్తామని.. ఎవరూ నిరాశ చెందొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.

తనకు డబ్బుపై ఆసక్తి, యావ రెండూ లేవని.. తాను హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు కూడా అద్దె ఇల్లు అని విజయసాయిరెడ్డి అన్నారు. ఎవరైనా తన పేరు ఉపయోగించి అవినీతికి పాల్పడితే చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. తనకు విశాఖలో స్ధిరపడాలనే కోరిక ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. కేవలం ఉత్తరాంధ్ర, విశాఖను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: జన హృదయ విజేత.. నేడు వైఎస్ వర్ధంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement