Monday, April 29, 2024

ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉపరాష్ట్రపతి.. స్వాగతం పలికిన కంభంపాటి హరిబాబు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈశాన్య రాష్ట్రాల పర్యనటన చేపట్టారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆయన సిక్కిం, మిజోరంలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఐజ్వాల్ చేరుకున్న వెంకయ్య నాయుడికి మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుతో పాటు ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ ఆర్.లాల్తాంగ్లియానా, రాజ్యసభ సభ్యులు వన్‌లాల్వేనా, ఇతర ప్రముఖులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

అనంతరం మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ఉపరాష్ట్రపతిని రాజ్‌భవన్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ఆధ్వర్యంలో సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ రాష్ట్ర సంప్రదాయ నృత్యాలను ఉపరాష్ట్రపతి తిలకించారు. మిజోరం సంస్కృతిని కళ్లకు కట్టేలా ప్రదర్శనలిచ్చిన కళాకారులకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. నేడు (గురువారం) ఆయన మిజోరం శాసనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement