Sunday, May 19, 2024

తిరుమలలో ముగియనున్న వసంతోత్సవాలు

తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ఇవాళ్టితో ముగియనుంది. వసంతోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆస్థానం కార్యక్రమం, తిరువీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది. కోవిడ్ నేపథ్యంలో వసంతోత్సవాలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటం, ఆంక్షల నేపథ్యంతో పాటు, స్థానికంగా టికెట్లను జారీ చేయడాన్ని నిలిపివేయడంతోనే భక్తుల రాక తగ్గిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement