Friday, April 26, 2024

ఏపీలో వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సిన్

కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామంది. ఏపీలో కరోనా నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులు, వ్యాక్సినేషన్‌ అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేలా 26,325 మంది వైద్య, ఇతర సిబ్బందిని నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఏపీలో ఇప్పటివరకు 1,995 బ్లాక్ ఫంగస్ కేసులు, 109 మరణాలు నమోదైనట్లు వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1300 బ్లాక్ ఫంగస్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొంది. ఏపీలో పీజీ మెడికల్ విద్యార్థుల సేవలకు భవిష్యత్‌లో వెయిటేజీ ఇస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. థర్డ్ వేవ్‌లో పిల్లలకు కరోనా వస్తుందని నిర్ధారణ కాలేదని, అయినా తాము ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కోర్టుకు వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement