Sunday, April 28, 2024

Breaking | నానక్​రామ్​గూడాలోని కొత్త భవనంలోకి యూఎస్​ కాన్సులేట్​ ఆఫీసు.. మార్చి 20 నుంచి అక్కడే సేవలు

సికింద్రాబాద్​లోని యూఎస్​ కాన్సులేట్​ ఆఫీసు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త భవనంలోకి మారనుంది. మార్చి 20 నుండిహైదరాబాద్ నానక్​రామ్​ గుడాలోని కొత్త భవనానికి మారనున్నట్టు ఆఫీసు వర్గాలు ఇవ్వాల (మంగళవారం) రాత్రి వెల్లడించాయి. ఈ కాన్సులేట్ భవనం నుండి కాన్సులర్ సేవలను అందించనున్నారు. కొత్త కాన్సులేట్‌లో సేవలు మార్చి 20న ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం సికింద్రాబాద్​లోని బేగంపేట దగ్గర ఉన్న పైగా ప్యాలెస్‌లో ఆఫీసు ఉండగా.. కార్యకలాపాలు మార్చి 15 మధ్యాహ్నం 12 గంటలకు ఆపేయనున్నారు. కాన్సులేట్ మార్చి 15 మధ్యాహ్నం 12 నుండి మార్చి 20 ఉదయం 8.30 వరకు మూసివేయనున్నట్టు ఆఫీసు వర్గాలు తెలిపాయి.

మార్చి 8, 15 మధ్య వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన దరఖాస్తుదారులు తమ ఇంటర్వ్యూల కోసం పైగా ప్యాలెస్‌కు వెళ్లాలి. మార్చి 23న లేదా ఆ తర్వాత వీసా ఇంటర్వ్యూ ఉన్న వారు నానక్​రామ్​గూడాలోని US కాన్సులేట్ కొత్త ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.   ఇక.. కాన్సులర్ సేవల గురించి సాధారణ ప్రశ్నల కోసం 91 120 4844644 ​,​ 91 22 62011000కు కాల్ చేయొచ్చు. ఇతర అప్‌డేట్‌ల కోసం  కాన్సులేట్ సోషల్ మీడియా అకౌంట్స్​ని కూడా పరిశీలించవచ్చని ఆఫీసు వర్గాల సమాచారం అందించాయి.Twitter (@USAndHyderabad), Instagram (@USCGHyderabad),Facebook (@usconsulategeneralhyderabad) .

Advertisement

తాజా వార్తలు

Advertisement