Saturday, May 4, 2024

హెలికాఫ్ట‌ర్ ని ఢీ కొన్న ప‌క్షి- సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కి త‌ప్పిన ముప్పు

సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ ను ఆకాశంలో ఓ పక్షి ఢీకొట్టడంతో పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్ కు సాంకేతిక పరీక్ష నిర్వహిస్తున్నారు. వారణాసిలోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా కిందకు దించాడు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత సీఎం యోగి సర్క్యూట్ హౌస్ కి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి లక్నో వెళ్లేందుకు అధికారులు ప్రభుత్వ విమానం ఏర్పాటు చేశారు. బాబట్ పూర్ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయల్దేరనుంది. ప్రస్తుతం రోడ్డు మార్గాన యోగి బాబట్ పూర్ విమానాశ్రయానికి వెళ్లారు.

https://twitter.com/Journalist_adp/status/1540933431869132800
Advertisement

తాజా వార్తలు

Advertisement