Monday, April 29, 2024

తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య.. ఉద్యోగం రాలేదని మనస్థాపంతో మృతి

తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే ఆవేదనతో ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచుకుంది. వేములవాడ మండలం ఎదురు గట్లలో ప్రశాంత్ అనే నిరుద్యోగి గ్రామ శివారులో తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు.  ఉద్యోగం రావట్లేదని  మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. రెండుసార్లు కానిస్టేబుల్ కు, ఆర్మీ ఉద్యోగాలకు ప్రయత్నించినా..ఉద్యోగం రాలేదు. దీంతో తరచూ ఆవేదన చెందే వాడని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement