Thursday, April 18, 2024

హైద‌రాబాద్ ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు : కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గరంలోని పీపుల్స్ ప్లాజా వ‌ద్ద చెత్త త‌ర‌లించే 40 అత్యాధునిక వాహ‌నాల‌ను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ… విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్ ఎద‌గాలంటే ఆధునిక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి దుర్గంధం వెద‌జ‌ల్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. 95 సెకండ‌రీ క‌లెక్ష‌న్ ట్రాన్స్‌ఫ‌ర్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నామ‌న్నారు. మొబైల్ క‌లెక్ష‌న్ ట్రాన్స్‌ఫ‌ర్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసుకున్నామ‌ని, హైద‌రాబాద్‌ను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ఏ న‌గ‌రంలో అయినా రెండు ముఖ్య‌మైన వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతాయ సాలిడ్, లిక్విడ్ వేస్ట్ ఉంటాయన్నారు.

స్వ‌చ్ఛ తెలంగాణ స్వ‌చ్ఛ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మంలో భాగంగా వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు ప‌రిష్కారాలు వెతుకుతూ వ‌స్తున్నామ‌న్నారు. 2014లో 2500 మెట్రిక్ ట‌న్నుల చెత్త సేక‌రిస్తే.. ప్ర‌స్తుతం 6 వేల మెట్రిక్ ట‌న్నుల చెత్త‌ను సేక‌రిస్తున్నామ‌న్నారు. 4500 స్వ‌చ్ఛ ఆటో టిప్ప‌ర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆటోల‌ను చెత్త సేక‌ర‌ణ‌కు ఉప‌యోగిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే మ‌రో 400 ఆటోలు నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని, 150 డివిజ‌న్ల‌లో డోర్ టు డోర్ క‌లెక్ష‌న్‌కు వినియోగిస్తామ‌న్నారు. అత్యాధునిక‌మైన సాలిడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ఉండాల‌న్న ఉద్దేశంతో అత్యాధునిక ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభిస్తున్నామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement