Sunday, April 28, 2024

Udayagiri – పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వైసీపీకి గుడ్ బై!

ఉదయగిరి వైసీపీకి షాక్
నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చిరంజీవి రెడ్డి చేరిక

ఆంధ్రప్రభ స్మార్ట్, మంగళగిరి ప్రతినిధి .. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మంగళవారం తన పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. మంగళగిరి కొండపనేని టౌన్ షిప్ లో ఎన్నికల ప్రచారంలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ పసుపుకండువా కప్పి చిరంజీవిరెడ్డి, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానాలు నచ్చక తాను తన పదవికి రాజీనామా చేసినట్లు చిరంజీవిరెడ్డి చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర భవిష్యత్తు బాగుండటమేగాక పోలీసుల సంక్షేమానికి కృషిచేస్తారని నమ్మి తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి వచ్చాక పోలీసు సోదరులు కూడా అన్నివిధాలా నష్టపోయారని తెలిపారు. కొందరు ఉన్నతస్థాయి పోలీసు అధికారులు మాత్రం తమ వ్యక్తిగత స్వార్థం కోసం వ్యవస్థను పణంగా పెట్టి జగన్ కు కొమ్ముకాస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాకబకాయిలన్నీ చెల్లిస్తామని అన్నారు. ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులను భర్తీచేసి పోలీసులపై పనిభారం తగ్గిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement