Friday, May 3, 2024

పాకిస్తాన్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత.. భారత్‌ ఆగ్రహం..

న్యూఢిల్లి : పాకిస్తాన్‌లోని పెషావర్‌ ప్రాంతంలోని సర్బండ్‌ పట్టణంలోని బాటా తాల్‌ బజార్‌లో సుగంధ ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు సిక్కు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారంనాడు కాల్చి చంపారు. మృతులను సల్జిత్‌ సింగ్‌, రణ్‌జీత్‌ సింగ్‌గా గుర్తించారు. కాగా ఈ సంఘటనపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లో ఇలాంటి సంఘటన ఇదే తొలిసారి కాదని పేర్కొంది. ఈ సంఘటనపట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ దుర్ఘటన తమకు దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొంది. పెషావర్‌లో దాదాపు 15వేలమంది సిక్కు మతస్తులు నివసిస్తున్నారు. రాజధానికి సమీపంలోని జోగన్‌ షా ప్రాంతంలో వీరి జనాభా ఎక్కువ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement