Thursday, April 25, 2024

Breaking : కారు ఢీకొని ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి

కారు ఢీకొని ఇద్ద‌రు పారిశుద్ద్య కార్మికులు మృతి చెందిన ఘ‌ట‌న మెదక్‌ పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్‌ వద్ద జరిగింది. శ‌నివారం ఉదయాన రోడ్లు శుభ్రం చేసేందుకు వచ్చిన పారిశుద్ధ్య సిబ్బందిపైకి రాందాస్‌ చౌరస్తా నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆల్టో కారు దూసుకెళ్లింది. కారు బలంగా ఢీ కొట్టడంతో దాయర వీధికి చెందిన నర్సమ్మ అక్కడికిక్కడే దుర్మరణం చెందింది. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ యాదమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు కార్మికులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసుల ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదంపై ఆరా తీరాశారు. డ్రైవ‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల‌కు న్యాయం చేయాల‌ని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement