Friday, April 26, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

ప్రభన్యూస్, యాదాద్రి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. యదాద్రిభువనగిరి జిల్లా రఘునాథపురం-ఆలేరు వెళ్లే రోడ్డులో ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన గొట్టిపర్తి బాలరాజు (31) కాసారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్ టీ సి డ్రైవర్ జిన్నింగ్ మిల్లు వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తము ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చ‌ద‌వండి : లాక డౌన్‌పై నిర్ణయాధికారం రాష్ట్రాలదే..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement