Tuesday, April 23, 2024

ఇద్దరు చిన్నారులను బలితీసుకున్న కసాయి తండ్రి


మహబూబాబాద్ : కుటుంబ కలహాలతో కన్న తండ్రి ఇద్దరు చిన్నారులను బావిలో పడేసి హత్య చేసిన సంఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా గడ్డి గూడెం తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గడ్డి గూడెం తండాకు చెందిన భూక్య రామ్ కుమార్, శీరిషలకు గత 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. రామ్ కుమార్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి కూతురు అమీ జాక్సన్ (9), బాబు జాని బేస్టో(6) ఉన్నారు. రామ్ కుమార్ గత కొంతకాలంగా భార్యతో తరచూ గొడవలు పడుతూ, భార్యను ఇబ్బందులకు గురి చేసేవాడని, అయితే రామ్ కుమార్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్య బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టాడు. ఆ డబ్బును వృధా చేయడంతో సోమవారం రాత్రి భార్య, మామ ఇద్దరు రామ్ కుమార్ ని మందలించడంతో కోపోద్రిక్తుడైన రామ్ కుమార్ భార్యను కొట్టి, నిద్రిస్తున్న చిన్నారులను వ్యవసాయ బావిలో పడేసి హత్య చేశాడని తెలిపారు. ఇద్దరు చిన్నారుల మృతితో గడ్డి గూడెం తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement