Monday, May 6, 2024

బ్లాక్ ఫంగస్ సోకి ఇద్దరు మృతి

దేశ ప్రజలను ఒకవైపు కరోనా వైరస్ భయపెడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వచ్చే బ్లాక్ ఫంగస్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఏపీ, తెలంగాణలో క్రమంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలువురు బ్లాక్ ఫంగస్ బారిన పడగా.. ఇప్పుడు ఏపీలోనూ బ్లాక్ ఫంగస్ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బ్లాక్ ఫంగస్ సోకి ఇద్దరు మృతి చెందారు. షుగర్ కంట్రోల్ లేకుండా ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే వారికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement