Thursday, May 16, 2024

దారుణం….కరోనా రోగి పై అత్యాచారం!!

కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఆక్సిజన్, బెడ్స్ లేక సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి కష్ట సమయంలో కూడా కొంత మంది కామాంధుల బుద్ధి మారటం లేదు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఈ ఘటన అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది. 43 ఏళ్ల ఓ మహిళ కరోనా తో బాధపడుతూ ఏప్రిల్ 6న గోపాల్ మెమోరియల్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అయింది.

కాగా ఆ సమయంలో తనపై మేల్ నర్స్ అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్ పై ఉంచారు. అయితే తాజాగా వైద్యం పొందుతూ మహిళ మృతి చెందింది. ఇక ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంతోష్ అహివార్ ను అరెస్ట్ చేశారు. సంతోష్ వయస్సు 40 యేళ్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement