Monday, April 29, 2024

kurnool: ఆటో, కారు ఢీకొని ఇద్దరు మృతి, ప‌లువురికి గాయాలు

క‌ర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఆటో, కారు ఢీకొని ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో ఎనిమిది మంది గాయ‌ప‌డిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆస్పరి – పత్తికొండ రహదారిలో ఈరోజు ఈ ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో మొత్తం పది మంది గాయ‌ప‌డ‌గా.. గాయ‌ప‌డిన‌వారిని ఆదోని ఆసుపత్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మిగ‌తా వారు ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మెరుగైన వైద్య‌ చికిత్సల‌ కోసం కర్నూలుకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement